హుజురాబాద్/డిసెంబర్03(మా అక్షరం): నియోజకవర్గంలోని జమ్మికుంట-హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులలో గుండె సంబంధిత డాక్టర్లు అందుబాటులో లేకపోవడం కారణంగా ఈ మధ్యకాలంలో గుండెపోటుతో చాలామంది మృతి చెందారని కావున నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రులలో గుండె సంబంధిత డాక్టర్లను సమకూర్చాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా కు మంగళవారం సామాజికవేత్త సబ్బని వెంకట్ వినతిపత్రం అందజేశారు. మంత్రి కూడా సానుకూలంగా స్పందించి త్వరలో అధికారులతో మాట్లాడి గుండె సంబంధిత డాక్టర్లను నియమిస్తానని హామీ ఇచ్చారని సబ్బని వెంకట్ తెలిపారు.
Post Views: 175











