– ప్రణవ్ ఆధ్వర్యంలో భారీగా తరలిన హుజురాబాద్ ప్రజలు…
– పెద్దపల్లిలో కాంగ్రెస్ యువ వికాస సభ…
– సభకు తరలివచ్చిన యువత,రైతులు…
హుజురాబాద్/ డిసెంబర్ 04(మా అక్షరం): ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు తెలుపుతూ,నిరుద్యోగులు, రైతుల గురించి ఆలోచించి అటు నిరుద్యోగులకు భరోసా ఉద్యోగ నియామక పత్రాలు ఆందజేస్తూ,రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.బుధవారం పెద్దపల్లిలో జరిగిన యువ వికాస సభకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో,జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.ఈ సభకు పెద్దఎత్తున హుజురాబాద్ నుండి యువత,రైతులు,కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరారు.ఈ సభతో కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ పెరిగింది.నిరుద్యోగులకు యాభై ఐదు వేల పై చిలుకు ఉద్యోగాలు ఇచ్చామని,రైతులకు రుణమాఫీ,బోనస్ ఇస్తూ మరింత బాధ్యతగా ముందుకు వెళ్తామనీ ఈ సభ ద్వారా స్పష్టమైందని తెలిపారు.రానున్న నాలుగేళ్లలో మరింత బాధ్యతగా పనిచేస్తామని తెలిపారు.











