-ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు జేరిపోతుల మహేందర్..
కరీంనగర్, గన్నేరువరం/ డిసెంబర్ 04 (మా అక్షరం):కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాతాశిశు ఆసుపత్రిలో చెరుకు సమ్మక్క (సమత) జి.ఎన్.ఎం. గా విధులు నిర్వర్తిస్తూ డ్యూటీలో మరణం చెందడం పట్ల ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు జేరిపోతుల మహేందర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమత రాత్రి వేళలో మాతాశిశు హాస్పిటల్ లో రాత్రివేళలో విధులు నిర్వర్తిస్తుండగానే మరణించడం పట్ల కుటుంబ సభ్యులకు పలు అనుమానాలు రేకెత్తించడం విషయమై అధికారులు త్వరితగతిన స్పందించి వాటిని నివృతి చేస్తూ, తను డ్యూటీలో మరణించినందుకుగాను, జిల్లా కలెక్టర్ స్పందించాలని అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కేటాయిస్తూ, తన ఇద్దరు పిల్లలకు ప్రభుత్వం తరఫున 25 లక్షల ఎక్స్గ్రేషియా (పరిహారం) అందించాల్సిందిగా పత్రికా ముఖంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూత్కూరి కాంతా, జాడి మల్లేశం, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.











