+91 99635 77856

చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..

చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..

హుజురాబాద్/ డిసెంబర్ 04(మా అక్షరం):
చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో ను రాణించాలని మాంటిస్సోరి అకాడమిక్ డైరెక్టర్ విష్ణుమహంతి భరత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమానికి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మటూరి మిథున ఏడవ తరగతి చదువుతున్న మాటూరి అవిఘ్నలు రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో కరీంనగర్ జిల్లా జట్టులో రాణించి విజయం సాధించడం అభినిందనీయమని,వీరు ఈనెల 8 నుంచి 14 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాండుసర్ లో జరిగే జాతీయ స్థాయి బాలికల అండర్ 14 హాకీ క్రీడా పోటీల్లో ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.అలాగే ప్రతి విద్యార్థి వారిని ఆదర్శంగా తీసుకొని చదువుల్లో రాణిస్తూనే క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గీతాషాజు, డైరెక్టర్స్ షాజూ థామస్, గండ్ర సుధాకర్ రెడ్డి, నూకల శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !