(కుడికాల సాయి మా అక్షరం ప్రతినిధి):
హుజురాబాద్/ డిసెంబర్13(మా అక్షరం): స్నేహితుడిని ఆర్థికంగా ఆదుకున్నందుకు గ్రామస్తులు వారి స్నేహబంధాన్ని అభినందించారు. ముందు తరాలకు మీ స్నేహబంధం ఆదర్శంగా ఉంటుందని గ్రామస్తులు అన్నారు.సింగాపూర్ గ్రామానికి చెందిన నీరటి కిరణ్ (37) గత పది రోజుల క్రితం మరణించగా ఆదివారం తన తోటి బాల్య మిత్రులు తనతో పాటు చదువుకున్న డిగ్రీకి చెందిన తోటి మిత్రులు చలించిపోయి వాట్సాప్ వేదికగా ఒకరి కొకరు చర్చించుకుని తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని జమచేసి. జమచేసిన 22.500 రూపాయలను నీరటి కిరణ్ కుటుంబ సభ్యులకు అందజేసి స్నేహితుని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు.స్నేహితుడిని ఆర్థికంగా ఆదుకున్నందుకు గ్రామస్తులు వారి స్నేహబంధాన్ని అభినందించారు.ముందు తరాలకు మీ స్నేహబంధం ఆదర్శంగా ఉంటుందని గ్రామస్తులు అన్నారు.ఆర్థిక సహాయం అందజేసిన వారిలో ఇజ్జిగిరి శ్రీకాంత్ ఏ ఆర్ కానిస్టేబుల్, ఇజ్జిగిరి సంపత్, విజేందర్ రెడ్డి , వంగల సాగర్ రెడ్డి, చందర్ మిగతా మిత్రులు ఉన్నారు.











