+91 99635 77856

మాదిగల ఐక్య సంక్షేమ సంఘం(మాస్)రాష్ట్ర నేతలకు ఘన సన్మానం.

(కుడికల సాయి మా అక్షరం ప్రతినిధి)
హుజరాబాద్/డిసెంబర్ 13(మా అక్షరం): రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు రామ్ సారయ్య, ప్రధాన కార్యదర్శిగా ఇమ్మడి పవిత్రను ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం పట్టణంలో ప్రజా సంఘాల, దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యం,లో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్ హాజరై రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దళిత, ప్రజాసంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా ఏకతాటి పైన తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తామని తెలియజేశారు.ఈకార్యక్రమంలో వేల్పుల రత్నం, బొడిగె మల్లయ్య, మట్టెడ ప్రకాష్, అంబాల రవీందర్, కట్కూరి రాజేందర్,రామ్ రాజేశ్వర్, వేల్పుల ప్రభాకర్, బత్తుల రాజలింగం, బొడ్డు ఐలయ్య, మాడుగుల ఓదెలు, మొలుగూరి కొమరయ్య, మోరే సతీష్, తిప్పారపు భువనచంద్ర, ఇమ్మడి వేణు, రొంటాల కుమారస్వామి,శనిగరం భాస్కర్, ఇమ్మడి రాజయ్య, దాట్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !