కరీంనగర్,తిమ్మాపూర్/డిసెంబర్26(మా అక్షరం):తిమ్మాపూర్ మండలం నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ రూ50వేలు విలువ చేసే ఏసీని విరాళంగా గురువారం ఆలయ కమిటీకీ అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రావుల రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ గౌడ్, డైరెక్టర్లు కందుకూరి లక్ష్మీరాజ్యం,అంజయ్య,భేతి శ్రీనివాస్ రెడ్డి, నూనె సురేష్, వంగల శ్రీనివాస్ రెడ్డి (పెద్ద), అజ్జు భాయ్, రాములు, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కనకయ్య ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
Post Views: 86











