కరీంనగర్, తిమ్మాపూర్/ డిసెంబర్ 26 (మా అక్షరం):కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం,పర్లపల్లి, కొత్తపెల్లి, పోలంపల్లి ఇంద్రనగర్, నుస్తులాపూర్ గ్రామాలలో సిపిఐ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఆయా గ్రామాల పార్టీ గ్రామశాఖ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పోలంపల్లిలో సిపిఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి మాట్లాడుతూ…భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న కాన్పూర్ నగరంలో ఆవిర్భవించిందని గురువారంతో 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో గ్రామాల్లో జెండాలు ఎగురవేసినట్లు తెలిపారు.కార్యక్రమాల్లో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, సహాయ కార్యదర్శిలు పిట్టల శ్రీనివాసు, సూరం మల్లేశం,ఆయా గ్రామాల గ్రామ శాఖ కార్యదర్శులు కాంతాల తిరుపతిరెడ్డి, గూడెం రమేష్ , పార్నంది రాజకుమార్, గంగిపల్లి శంకర్ పార్టీ నాయకులు కొలిపాక రమేష్, లక్ష్మణ్, క్రాంతి కుమార్,ముత్త యేళ్ళస్వామి, కనకం మొండయ్య, మర్రి కొమరయ్య,సరంగం రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు











