కరీంనగర్, తిమ్మాపూర్/డిసెంబర్31(మా అక్షరం):తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామం మాజీ వార్డు సభ్యురాలు,కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాగుల నర్మద -పర్శరాములు గౌడ్ దంపతుల కుమార్తె రేణురుగ్వేద ఏడవ పుట్టిన రోజు సందర్భంగా పారిశుద్య కార్మికులకు నూతన వస్త్రాలు బహుకరించారు. అనాధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఆతిథ్యం స్వీకరించిన ఆశ్రమంలోని అనాధలు జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపి, మనసారా దీవించారు. పర్శరాములు దంపతులు మాట్లాడుతూ..కూతిరి జన్మదినం సందర్భంగా అనాధలకు అన్నం పెట్టడం మిక్కిలి ఆనందాన్ని కలిగించిందన్నారు.ఈ కార్యక్రమంలో కర్ణబత్తుల మనోహర్,బనుక సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 220











