–ఎమ్మెల్యే పిలుపుమేరకు తన వంతు చిరు సహాయం…
-ఎమ్మెల్యేకు అందించిన గట్టు తిరుపతి గౌడ్..
శంకరపట్నం/ కరీంనగర్/జనవరి 01/ (మా అక్షరం):శంకరపట్నం మండలం కాచాపూర్ మాజీ సర్పంచ్,కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి,పద్మావతి సీడ్స్ అధినేత గట్టు తిరుపతి గౌడ్ బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా పేద విద్యార్థులకు బుక్స్,పెన్నులు అందించాలని తన వంతు కృషిగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వర్గస్తులవ్వడంతో ఇటీవల న్యూ ఇయర్ వేడుకలు,మద్యానికి దూరంగా ఉండాలని తెలపడంతో తన బలం,బలగమైన కార్యకర్తలు,నాయకులు న్యూ ఇయర్ వేడుకలలో మద్యం,వేడుకలకు దూరంగా ఉన్నందుకు హర్షం వ్యక్తం చేశారు.సామాజిక దృక్పథంతో పేద విద్యార్థులకు పెన్నులు,బుక్కులు పంపిణీ చేసిన గట్టు తిరుపతిని అభినందించారు.కరీంనగర్ జిల్లా ప్రజలకు,తన బలం బలగమైనా కార్యకర్తలకు,నాయకులకు మరొకసారి నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.నూతన సంవత్సరం ప్రతి కుటుంబంలో నూతన ఉత్తేజాన్ని ప్రేరేపించి,ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో,సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.











