కరీంనగర్, తిమ్మాపూర్ జనవరి 01 (మా అక్షరం):తిమ్మాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో మాజీ మండల వైస్ ఎంపీపీ తుమ్మనపెల్లి శ్రీనివాస్ రావు జన్మదిన వేడుకలను బుధవారం ఆయా గ్రామాల అభిమానులు ఘనంగా నిర్వహించారు.మండల వ్యాప్తంగా నిర్వహించిన ఈ వేడుకలకు తుమ్మనపెల్లి శ్రీనివాస్ రావు హజరవగా అభిమానులు టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేస్తూ ఘన స్వాగతం పలికి బొకేలు శాలువాతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు ఆయా గ్రామాల్లో అభిమానులతో కలిసి కేకు చేశారు. మండలం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది.రామకృష్ణకాలనీ వద్ద కాంగ్రెస్ నాయకులు దావు సంపత్ రెడ్డి పుట్టినరోజు కూడా ఉండడంతో ఇద్దరు కలిసి ఒకే కేకు కోసి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా తుమ్మనపెల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ….తనపై ఇంత అభిమానం చూపుతున్న మండల యువతకు కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక ఆటో యునియన్ సభ్యులకు తనపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతగా ఎమ్మెల్యే కవ్వంపల్లితో మాట్లాడి ఆటో యూనియన్ స్థలాన్ని ఏర్పాటు చేయించి యూనియన్ కు భవనాన్ని నిర్మింపజేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బ్లాగ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్, దావు సంపత్ రెడ్డి, రెడ్డిగాని రాజు, గుంటి మధు, గుంటి శ్రీనివాస్, అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, శీనన్న యువసేన అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.











