+91 99635 77856

కోర్టు ఆవరణ లో ముందస్తు సంక్రాంతి వేడుకలు

హుజురాబాద్/జనవరి10(మా అక్షరం): సంక్రాంతి సందర్భంగా హుజురాబాద్ కోర్ట్ ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ కోర్టులోని మహిళ న్యాయవాదులతో పాటు వివిధ కోర్టులలో పనిచేస్తున్న మహిళా సిబ్బంది కలిసి శుక్రవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు నిర్వహించుకున్నారు. అందులో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో వేసిన ముగ్గులు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం హుజురాబాద్ సబ్ జడ్జీ పి.బి. కిరణ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జీ పి.ఆలేఖ్య, మేజిస్ట్రేట్ లు గెడెం స్వాతి, పద్మ సాయి శ్రీ లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ప్రకటించారు. కాగా మొదటి బహుమతి మహిళా న్యాయవాదులను వరించగా,రెండవ బహుమతి రెండవ అడిషనల్ కోర్టు సిబ్బంది, మూడవ బహుమతి సబ్ కోర్టు సిబ్బంది గెలుచుకోగా జూనియర్ సివిల్ కోర్టు సిబ్బంది, మొదటి అడిషనల్ కోర్టు సిబ్బంది కన్సోలేషన్ బహుమతులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోయేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్, కార్యదర్శి మట్టెల తిరుపతి, ఉపాధ్యక్షులు బండి రమేష్, పలువురు న్యాయవాదులుకోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !