+91 99635 77856

తహశీల్దార్ కు వినతిపత్రం అందించిన కిసాన్ మోర్చా నాయకులు

కరీంనగర్, తిమ్మాపూర్ జనవరి 10 (మా అక్షరం): తిమ్మాపూర్ మండలంకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఆద్వర్యంలో తహశీల్దార్ కు వినతిపత్రం అందించారు.అనంతరం కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బోనాల మోహన్ మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన 2,00,000/- లక్షల రుణమాఫీ. 3,00,000/- లక్షల వడ్డీ లేని రుణాలు,రైతు భరోసా ఎకరాకు ఫసలుకు 7500/- లు నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తామన్న భూసార పరీక్ష కేంద్రంతో పాటు మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను ఎటువంటి పరిమితులు లేకుండా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ఇ సి మెంబర్ చింతం శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి ,జిల్లా కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి వేల్పుల రవి,తమ్మనవేని రాజు,కొయ్యడ శ్రీనివాస్ ,కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్షులు బుర్ర శ్రీనివాస్ ,మధుకర్ రెడ్డి,దళిత మోర్చా మండల అధ్యక్షులు ఎలుకపల్లి.స్వామి,సంపత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి,పల్లె కుమార్,పాశం సంపత్,నాంపల్లి శ్రీనివాస్,పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !