+91 99635 77856

క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది

 – తిమ్మాపూర్‌ సర్కిల్‌ ఎస్సైలు వివేక్‌, నరేశ్‌, రాజేశ్‌..
తిమ్మాపూర్/ జనవరి 12 (మా అక్షరం):
క్రీడలతో శారీక దారుఢ్యం, పోటీతత‍్వం, స్నేహభావం పె పెంపొందుతాయని తిమ్మాపూర్‌ సర్కిల్‌ ఎస్సైలు తాండ్ర వివేక్‌, నరేశ్‌, రాజేశ్‌ లు అన్నారు. మహాత్మా నగర్ పంచాయతీ పరిధిలోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో పోలీస్ అండ్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్ ఆదివారం నిర్వహించారు. శ్రీ చైతన్యకళాశాల డైరెక్టర్ నరేందర్‌రెడ్డి ప్రెస్ టీం కెప్టెన్‌ బత్తుల రాకేష్, పోలీసు టీం కెప్టెన్ నరేశ్‌ను ఆహ్వానించి టాస్ వేశారు.. రెండు మ్యాచ్‌లలో టాస్ గెలిచిన ప్రెస్ టీం మొదటగా బ్యాటింగ్ చేసి రెండు మ్యాచ్ ల్లో పోలీసు టీంపై విజయం సాధించింది. ఈ సందర్భంగా తిమ్మాపూర్ సర్కిల్ ఎస్సైలు వివేక్, నరేష్,రాజేష్ మాట్లాడుతూ క్రీడాలు మానసిక ఉల్లాసానికి శరీర దృఢత్వానికి దోహదపడతాయని, క్రీడా నైపుణ్యంపై అవగాహన కల్పించడం కోసమే పోలీస్ టీం, ప్రెస్ టీంలు క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించామని తెలిపారు. ఇరుజట్లు అద్భుత ప్రదర్శన కనబర్చాయని తెలిపారు. గెలిచిన ప్రెస్ టీంను అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !