తిమ్మాపూర్/ జనవరి 14 (మా అక్షరం):కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లిలోని ఢీ 4 కెనాల్ కు ఆదివారం గండిపడి గ్రామంలోకి నీళ్లు చేరి సుమారు 30 కుటుంబాలు నిత్యవసర సరుకులు కోల్పోయి ఇబ్బందులు పడుతుండగా మాజీ ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ ద్వారా విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ మండలాధ్యక్షుడు నుస్తలాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ కుటుంబానికి 25 కిలోల చొప్పున భాదిత కుటుంబాలకు బియ్యాన్ని పంపిణీ చేశారు.అనంతరం రావుల రమేష్ మాట్లాడుతూ….. వరద కాలువకు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయించి సమస్య మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రావుల రమేష్,మాజీ ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ లకు బాధిత కుటుంబాలు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నార్ల అశోక్,నాంపల్లి శంకర్, పెట్టం రమేష్, బీనపల్లి రాజయ్య, గుంటి కిష్టయ్య, బౌత్ గంగాధర్, రావుల మల్లేశం, అసోద అంజయ్య, ఉప్పులేటి తిరుపతి, సుధగోని శ్రావణ్ కుమార్ ,పార్నంది సంపత్, పార్నంది స్వామి, బొజ్జ శ్రీనివాస్, బూడిద కిషోర్, బూడిద రమేష్, బీనపల్లి బాలయ్య, సుధగోని సదయ్య, దరిపల్లి వేణు కుమార్, నాంపల్లి శ్రీకాంత్, బోయిని శ్రీకాంత్, పార్నంది పోచమల్లు, బుర్ర శ్రీనివాస్, మాచర్ల నర్శయ్య,ఆశోద సాయి కృష్ణ, గోదారి నాగేంద్ర,బూడిద రంజిత్, కామెరా బొందయ్య తదితరులు పాల్గొన్నారు.











