+91 99635 77856

క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న యాదవ సంఘం నాయకులు

-అఖిల భారత యాదవ మహసభ క్యాలెండర్ ఆవిష్కరణ..
హుజురాబాద్/ జనవరి17(మా అక్షరం): అఖిల భారత యాదవ మహా సభ హుజూరాబాద్ పట్టణ,మండల సమావేశం శుక్రవారం పట్టణంలో అధ్యక్షుడు బద్దుల రాజ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు నాగరం సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ.. యాదవుల ఎదుగుదలకి అందరూ పాటుపడాలని రానున్న స్థానిక సంస్థల్లో యాదవులు సత్తా చాటాలని రాజకీయంగా ఎదగాలని కోరారు. జనాభా ప్రతిపాదిక ప్రకారం బీసీలకు కేటాయించిన స్థానాలలో యాదవులు పోటీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మక్కపల్లి కుమార్ యాదవ్ , మాజి వైస్ ఎంపీపీ బండి రమేష్ యాదవ్, కన్నబోయిన మహేందర్ యాదవ్, బెల్లి రాజయ్య యాదవ్, గడ్డి రాములు యాదవ్, గండు ప్రశాంత్ యాదవ్, బోయిని సంపత్ యాదవ్, మేరుగు రమేష్, శ్రీనివాస్, శంకర్, మాధమ్ ఐలయ్య, సమ్మయ్య, తిరుపతి, రాజు, సంపత్, మల్లికోట, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !