హుజురాబాద్ /జనవరి18 (మా అక్షరం): మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తలకొక్కుల హరి ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక శిశు మందిర్ పాఠశాలలో శనివారం అసోసియేషన్ సభ్యులు సమావేము జరిగింది. ఈ సమావేశంలోఅధ్యక్షుని గా ఏకగ్రీవంగాఎన్నుకున్నారు. ఈ పదవి కాలం రెండు సంవత్సరాలు ఉంటుందని సభ్యులు తీర్మానించారు. ఈ సందర్భంగా హరి ప్రసాద్ మాట్లాడుతూ… సంఘం కోసం సంఘ నియమాల కోసం పని చేస్తానని సంఘము అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో అధ్యక్షడు గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిరి రవన్న, రాష్ట్ర సలహాదారు కేదార్ రెడ్డి, మాజీ అధ్యక్షులు మాచర్ల రాజుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి ఉపాధ్యక్షులు యాకుబ్ అలీ, ప్రధాన కార్యదర్శి దూలం చిరంజీవి, శ్రీశైలం, వోడపల్లి రాజు, మధుకర్, ఎడ్ల కుమార్, భాష బోయిన రాజేష్, బింగి మురళి, రాజేష్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.











