+91 99635 77856

కరీంనగర్ మహిళా ఉపాధ్యక్షురాలుగా లంక దాసరి లావణ్య..

హుజురాబాద్/ఫిబ్రవరి 08 (మా అక్షరం): జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా హుజురాబాద్ పట్టణానికి చెందిన లంక దాసరి లావణ్య- ప్రవీణ్ ను నియమిస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి శనివారం నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ… జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ నియామకానికి సహకరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !