హుజురాబాద్/ఫిబ్రవరి 08 (మా అక్షరం): జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా హుజురాబాద్ పట్టణానికి చెందిన లంక దాసరి లావణ్య- ప్రవీణ్ ను నియమిస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి శనివారం నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ… జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ నియామకానికి సహకరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 222











