– త్వరలోనే ఇళ్ళందకుంట ఆలయ కమిటీ ఏర్పాటు….
– హుజురాబాద్ లోని దేవాలయాల సమస్యలపై వినతి పత్రం అందజేత…
– రాములోరి కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు…
హుజురాబాద్/మార్చి08(మా అక్షరం): నియోజకవర్గంలో ఉన్న దేవాలయల అర్చకుల సమస్యలపై దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను శనివారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా అపర భద్రాద్రిగా పేరొందిన ఇళ్ళందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన కమిటీ త్వరలోనే ఏర్పాటు చేసి,బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా నిర్వహిస్తామని మంత్రికి ప్రణవ్ తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని,దాంట్లో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గ దేవాలయాల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.











