హుజురాబాద్/ ఏప్రిల్ 02(మా అక్షరం): నియోజకవర్గం కాంగ్రేస్ సేవాదళ్ అధ్యక్షులుగా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన నరేడ్ల వినోద్ రెడ్డిని నియమిస్తూ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్, జిల్లా అధ్యక్షులు పత్తి మధుబాబు ఉత్తర్వులు జారీ చేశారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వినోద్ రెడ్డి విశేషంగా కృషి చేస్తూ పార్టీ అభివృద్ధికి పాటుపడుతుండడంతో ఆయనను ఈ పదవిలో నియమించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా నా వంతు కృషి చేస్తానని అన్నారు.నాపైన ఉన్న నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్, జిల్లా అధ్యక్షుడు మధుబాబు, సహకరించిన డీసీసీ అధ్యక్షులు కవ్వం పల్లి సత్యనారాయణకి, హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబుకి, పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డికి ఇతర జిల్లా, నియోజకవర్గ నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.











