హుజురాబాద్/ ఏప్రిల్ 02 (మా అక్షరం): కరీంనగర్ కమర్షియల్ టాక్స్ ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్గా సేవలందించిన హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన చేరాల సాయిలు పదవి విరమణ పొందగా బుధవారం కరీంనగర్ లోని ప్రకృతి హోటల్లో ఘనంగా పదవి విరమణ సన్మాన మహోత్సవం నిర్వహించారు.ఈ వేడుకకు వరంగల్ కమర్షియల్ టాక్స్ నోడల్ అధికారి ఆర్. శశిధర్ చారి, కరీంనగర్ జె.సి. రవికుమార్, ఆఫీసర్ భిక్షపతి, పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సబ్బని రాజేందర్, జిల్లా పో పా ఉపాధ్యక్షులు తవుటం సంపత్ కుమార్, ఎల్ఐసి సీనియర్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైసర్ ఎనగందుల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 404











