హుజురాబాద్/ ఏప్రిల్02(మా అక్షరం): జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (ఐ.ఎన్.టి.ఎస్.ఓ) పరీక్షలో హుజురాబాద్ పట్టణంలోని శ్రీ కాకతీయ పాఠశాల (శ్రీ చైతన్య కరికులం) విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మాట్ల సందీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో మాడిశెట్టి శ్రీహర్షిత, రెండవ స్థానంలో చిలకమారి హర్షిత, మూడో స్థానంలో సకినపల్లి శ్రీజ, దెనికన మేఘన్ష్, నాలుగో స్థానంలో భారత సాత్విక, పల్లేని సాయి, ఐదో స్థానంలో పడాల అభినందిక, పొద్దుటూరి సహస్ర రెడ్డి లు గోల్డ్ మెడల్స్, ప్రైజ్ లు, సర్టిఫికేట్లు సాధించినట్లు తెలిపారు. వీరితో పాటు 78 మందికి కన్సోలేషన్ ప్రైజ్ లు, ఏడుగురికి స్పెషల్ ప్రైజ్ లు, పొందారని చెప్పారు. పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం ముద్రకోల రాజు, కోఆర్డినేటర్ ప్రవీణ్, డిన్ శ్రీనివాస్, రజిత, మల్లేష్, అనూష, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.











