+91 99635 77856

రోడ్లపై ధాన్యం పోయకుండా రైతులు సహకరించాలి

-హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్…

హుజురాబాద్/ ఏప్రిల్ 04 (మా అక్షరం): మండలంలో వరి కోతలు మొదలయ్యాయని, రైతులెవ్వరు రోడ్లపై వరి ధాన్యాన్ని పోయకుండా సహకరించాలని హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్ రైతులను విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మండలంలోని రైతులను ఉద్దేశించి తన కార్యాలయంలో మాట్లాడారు. రైతులు రోడ్లపై దాన్యం పోయడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. రాత్రిపూట వాహనాలు నడిపే వాహనదారులకు ధాన్యం కనిపించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. గతంలో రోడ్లపై ధాన్యం పోయడం వల్ల చాలా ప్రమాదాలు జరిగి ప్రాణా నష్టం కూడా జరిగిన సంఘటనలు మర్చిపోకూడదని అన్నారు. దయచేసి రైతులు ఎవరు రోడ్లపై ధాన్యాన్ని పొయ్యరాదన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !