హుజురాబాద్/ఏప్రిల్ 06(మా అక్షరం): ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అనంతరం రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత మజ్జిక పంపిణీని, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి భక్తులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Post Views: 198











