+91 99635 77856

శంకరపట్నం మండల కేంద్రంలో బీసీ ఆజాది సత్యాగ్రహ దీక్ష…

శంకరపట్నం మండల కేంద్రంలో బీసీ ఆజాది సత్యాగ్రహ దీక్ష…
శంకరపట్నం/ ఏప్రిల్ 13 (మా అక్షరం): తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల కోసం, దేశవ్యాప్తంగా కులగణనను అమలు చేయాలని, అలాగే తెలంగాణ బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని డిల్లీలో కొనసాగుతున్న బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి సంఘీభావంగా, ఆదివారం శంకరపట్నం మండల కేంద్రంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి బొంగోని అభిలాష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు చేపట్టారు. దీక్షకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కుడికల భాస్కర్, జిల్లా కన్వీనర్ చిలుకమరి శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి జినుకల లక్ష్మణ్ రావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు గజవెళ్లి మనోహర్ హాజరై, ఉద్యమానికి మద్దతు తెలిపారు.బీసీల హక్కుల సాధన కోసం సమస్త బీసీ వర్గాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని నాయకులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !