పెద్ద పాపయ్యపల్లి పద్మశాలి సంఘం నూతన కమిటీ ఎన్నిక…
– అధ్యక్షునిగా సుంకేనపల్లి శ్రీనివాస్…
హుజురాబాద్/ ఏప్రిల్ 13 (మా అక్షరం): మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామ పద్మశాలి సంఘం నూతన కమిటీ ఆదివారం ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుడిగా సుంకెనపల్లి శ్రీనివాస్ ప్రత్యర్థి కుసుమ మల్లయ్య పై గెలుపొందారు.ఉపాధ్యక్షులుగా తలకొక్కుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తలకొక్కుల రమేష్ ,సహాయ కార్యదర్శి జడల మోహన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కోశాధికారిగా రాజుకుమార్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వేముల యాదగిరి, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బని రాజేందర్, నాయకులు ఆడెపు శ్రీనివాస్ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
Post Views: 548











