హుజురాబాద్/మే13(మా అక్షరం): వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గా కొమరవెల్లి హరిప్రసాద్ , ఉపాధ్యక్షుడిగా మండల యాదగిరి , కోశాధికారిగా చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా మంగళవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద దాట్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. వాకర్స్ గ్రౌండ్ అభివృద్ధికి నూతన కార్యవర్గం చిత్తశుద్ధి తో కృషి చేయాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి సిటిజెన్ ఫోరం ప్రెసిడెంట్ చందుపట్ల జనార్ధన్, కార్యదర్శి సందేల వెంకన్న, మాజీ వాకర్స్ అధ్యక్షుడు వేముల గోవర్ధన్ , వేల్పుల రత్నం, ఆకుల సదానందం,డాక్టర్ తడికమళ్ళ శేఖర్, అబ్దుల్ మతిన్, కొనిపాక సమ్మన్న పంజాల రవీందర్ గౌడ్, గాజర్ల బుచ్చి రాజం, కడారి ఆదాం, బత్తుల రాజు లింగం,రొంటాల సుమన్, ఎర్ర రాజు,గోస్కుల మధుకర్,సిరికొండ సమ్మయ్య, వేల్పుల ప్రభాకర్,గూళ్ళ విష్ణు,గొట్టే కుమార్,మిల్కూరి రామచంద్రం, పాల్గొన్నారు.











