+91 99635 77856

హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలి..

-బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మలారెడ్డి..
హుజురాబాద్/మే17(మా అక్షరం): హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మలారెడ్డి పిలుపు నిచ్చారు.పట్టణంలోని శిశు మందిర్ లో శనివారం బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర, తిరంగా యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మలరెడ్డి మాట్లాడుతూ… ఈనెల 22వ తేదీన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్ లో నిర్వహించే యాత్రలను హిందువులంతా ఏకమై విజయవంతం చేయాలని కోరారు.రాష్ట్రంలో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని హిందువులంతా సంఘటితమై హిందువుల శక్తి చాటాలని పిలుపునిచ్చారు. ఈనెల 20వ తేదీన హుజురాబాద్ లో తిరంగా యాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి యువకులు విద్యార్థులు రైతులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు తరలివచ్చి దేశభక్తిని చాటుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్,జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ రావుల వేణు, బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, సీనియర్ నాయకులు అంకటి వాసు, నరాల రాజశేఖర్, తిప్ప బత్తిని రాజు, సబ్బని రమేష్, బోరగళ్ళ సారయ్య, ఎంసాని శశిధర్, కొలిపాక వెంకటేష్, భాస్కర్ యాదవ్, ఓడ్నాల విజయ్, ఓడ్నాల చంద్రిక, కొల్లిపాక వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !