+91 99635 77856

చిన్నారులకు అరటి పండ్లు, కోడిగుడ్లు పంపిణీ చేసిన నాగార్జున డైరీ

హుజురాబాద్/మే17(మా అక్షరం): పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో బాలబాలికలకు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్న వారందరికీ మండలంలోని పెద్ద పాపయ్యపల్లి గ్రామ సమీపంలో ఉన్న నాగార్జున డేయిరీ ఆధ్వర్యంలో ఎండి పుల్లూరి ప్రభాకర్ రావు, డైరెక్టర్ గణేష్ రావు ఆదేశానుసారం ఏజియం ఆకునూరి సుధాకర్ చేతులమీదుగా శనివారం సుమారు 180 మంది పిల్లలకు అరటిపండ్లు, కోడిగుడ్డు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఏజీఎం సుధాకర్ మాట్లాడుతూ… చిన్నారులు ఆటపాటలతో పాటు సమ్మర్ ఉచిత కోచింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంపొందించు కోవాలన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో చదువుకు ఉపయోగపడే మేధస్సు పెరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వాకర్స్ నేతలు, అధ్యక్షుడు కే హరిప్రసాద్, ఉపాధ్యక్షుడు మండల యాదగిరి, మాజీ వాకర్స్ నాయకులు గోవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, మతిన్, తదితర సభ్యులు, కరాటే మాస్టర్ బి బాబురావు, మున్సిపల్ సిబ్బంది ప్రతాప రాజు, రొంటాల సుధీర్, తూముల కుమార్, వినయ్, నరేష్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !