+91 99635 77856

వాసంశెట్టి మాధవి హుజురాబాద్ ఏసీపీగా నియామకం

హుజురాబాద్/మే 20(మా అక్షరం): హుజురాబాద్ నూతన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా వాసంశెట్టి మాధవి నియమితులయ్యారు. ఇప్పటి వరకు హుజురాబాద్ ఏసీపీగా పనిచేసిన శ్రీనివాస్ జి బదిలీపై డీజీపీ కార్యాలయానికి అటాచ్‌గా పోస్టింగ్ పొందారు.ఇంతకుముందు హుజురాబాద్ సీఐగా విధులు నిర్వహించిన మాధవి, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించిన పోలీసు అధికారిణిగా గుర్తింపు పొందారు. కరోనా మహమ్మారి సమయంలో ఆమె చేసిన సేవలు స్థానికుల మదిలో గుర్తుండిపోయాయి.ఆమె మళ్లీ హుజురాబాద్‌కు ఏసీపీగా రావడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాధవి నేతృత్వంలో పోలీసు శాఖ మరింత నిబద్ధత, పారదర్శకతతో పనిచేస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !