హుజూరాబాద్/ జూన్ 11(మా అక్షరం): హుజూరాబాద్ కొత్త అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా నియమితులైన వాసంశెట్టి మాధవి ని బుధవారం బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాధవి ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జిల్లా కార్యదర్శి నరసింహ రాజు, హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, జమ్మికుంట మండల అధ్యక్షులు సంపెల్లి సంపత్ రావు, కొలగాని రాజు, ఇల్లంతకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణ రెడ్డి, వీణవంక మండల అధ్యక్షుడు బత్తిని నరేష్, సైదాపూర్ మండల అధ్యక్షులు దంచనాల శ్రీనివాస్, హుజూరాబాద్ మాజీ పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, ప్రజాప్రతినిధులు పైళ్ల వెంకటరెడ్డి, బీజేపీ నాయకులు కొండల్ రెడ్డి, తిప్పపత్తిని రాజు, పూర్ణచందర్ రెడ్డి, గుర్రం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.











