హుజురాబాద్/ జూన్ 18 (మా అక్షరం):భార్యతో గొడవపడి యువకుడు కెనాల్లో దూకిన ఘటన హుజురాబాద్ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా నకిరేకల్కు చెందిన శివరాత్రి సైదులు (26) బావులు తవ్వే పనుల నిమిత్తం హుజురాబాద్ వద్ద ఉంటున్నాడు. భార్య సోదరుడు బెదిరించడంతో కోపంగా సైదులు కెనాల్లోకి దూకాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఫైర్ సిబ్బంది స్థానికుల సహాయంతో బయటకు తీశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 726











