హుజూరాబాద్ /జూన్ 19(మా అక్షరం):
ఏఐసీసీ అగ్రనేత, లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా హుజూరాబాద్ మండలంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని ఎంజేపీటిబీసడబ్ల్యూసీ (బాయ్స్) గురుకుల పాఠశాల ఆవరణంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పంజాల అరవింద్ గౌడ్ నేతృత్వం వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ….రాహుల్ గాంధీ దేశం మొత్తంగా ప్రేమ, ఐక్యత సందేశాన్ని ఇచ్చే నేత. దేశ భవిష్యత్తు కోసం యువతరం ఆశించే నాయకత్వం ఆయనదే” అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మేకల రాజు కుమార్, చల్లూరి విష్ణువర్ధన్, ప్రధాన కార్యదర్శి పంజాల రాజు గౌడ్, అసెంబ్లీ ఉపాధ్యక్షురాలు గోస్కులా నాగమణి, తదితర నాయకులు లావణ్య, పిట్ట సాయి, ఏనుగుల బన్నీ, సాయి, గోస్కులా మధుకర్, రాజేష్, సాయితేజ పాల్గొన్నారు.











