హుజురాబాద్/ జూన్ 25 (మా అక్షరం):
సబ్ జూనియర్ జాతీయ హాకీ జట్టుకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన హాకీ క్రీడాకారిణులు తాళ్లపల్లి మేఘన ,జంపాల శివ సంతోషిని ఎంపికయ్యారు. ఈ విషయాన్ని హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, సెక్రటరీ బొడిగె తిరుపతి , జిల్లా ఇంచార్జ్ సెక్రటరీ తారిక్ హైమద్ బుధవారం వెల్లడించారు.గత నెల హైదరాబాద్లోని రైల్వే స్టేడియంలో నిర్వహించిన సబ్ జూనియర్ ఉమెన్ జాతీయస్థాయి ఎంపిక పోటీలలో ఈ ఇద్దరు క్రీడాకారిణులు మెరుగైన ప్రతిభను కనబరిచారని, అందుకే జాతీయ జట్టుకు ఎంపికయ్యారని వారు తెలిపారు.ఈ ఎంపిక పట్ల జిల్లా హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ క్లబ్ మాజీ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, గుడెలుగుల సమ్మయ్య, క్లబ్ ఉపాధ్యక్షులు యూసుఫ్, వేముల రవికుమార్, సాదుల శ్యాంసుందర్, రాజేష్ సాయి కృష్ణ, ప్రదీప్, కే. రాజేష్, కోచ్ విక్రమ్, వినయ్తో పాటు పలువురు సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.











