– హుజురాబాద్ ఎండిఓ ఆఫీసులో నిర్వహణ…
హుజురాబాద్ /జూన్ 26 (మా అక్షరం): డయేరియా వ్యాధి నివారణ ,నిరోధక చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశ్యంతో హుజురాబాద్ ఎండిఓ ఆఫీస్లో గురువారం అవగాహన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైద్యాధికారి డాక్టర్ మధు మాట్లాడుతూ… డయేరియా వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారించాలంటే శుభ్రమైన నీటి వినియోగం ఎంతో కీలకమని, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రత పాటించడం అవసరమని సూచించారు.ఈ సందర్భంగా డయేరియా వ్యాధి సంబంధిత అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ మధు, డాక్టర్ జరీనా,ఎండిఓ, ఎంఈఓ, ఎంపీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 80











