హుజురాబాద్/ జూన్ 26 (మా అక్షరం): మండలంలోని సింగపూర్ గ్రామానికి చెందిన అమ్ముల అయిలుమల్లు ఇటీవల మరణించగా, ఆయన కుటుంబాన్ని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ గురువారం పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని, పార్టీ తరపున అన్ని విధాలుగా సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Post Views: 192











