+91 99635 77856

చలానా కన్నా ఎక్కువ వసూళ్లు

– భీమదేవరపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు…భీమదేవరపల్లి/జూన్ 26 (మా అక్షరం):
సర్వసాధారణ ప్రజల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారం నేపథ్యంలో భీమదేవరపల్లి మండలంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఉదయం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో డాక్యుమెంట్ రైటర్ల వద్ద రూ.96,870 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ… “ఇటీవలి కొన్ని రోజులుగా ఈ కార్యాలయంలో అధికారుల అవగాహనతో డాక్యుమెంట్ రైటర్లు ప్రజల నుంచి చలానా కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారం వచ్చింది. దీని మేరకు డీజీపీ విజయ్‌కుమార్ ఆదేశాల మేరకు సర్ప్రైజ్ చెక్‌ నిర్వహించాం” అని తెలిపారు.మధ్యవర్తుల మాయాజాలంఅధికారికంగా తక్కువ ఖర్చుతో జరగాల్సిన రిజిస్ట్రేషన్ పనులు మధ్యవర్తుల మాయాజాలంలో చిక్కి అధిక లావాదేవీలకు గురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సరళంగా అందాల్సిన సేవలు కొందరి స్వార్థం కోసం అడ్డంకులు ఎదురవుతున్నాయని విమర్శించారు.నివేదిక ప్రభుత్వానికి ఈ తనిఖీల్లో బయటపడిన విషయాలపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తున్నామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజాసేవలో పారదర్శకతను దెబ్బతీసే చర్యలు పూర్తిగా చట్ట విరుద్ధం అని ఆయన స్పష్టం చేశారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !