+91 99635 77856

మంచినీటి బావిపై జాలి ఏర్పాటు చేయాలి

హుజురాబాద్ /జూలై 09 (మా అక్షరం): పట్టణంలోని 23వ వార్డులో బేడ బుడగ జంగాల కాలనీ సమీపంలో ప్రజల దాహార్తిని తీర్చే మంచినీటి బావి భూమి సమపాళ్లలో ఉండటంతో కుక్కలు, పందులు వంటివి బావిలో పడి మృతి చెందుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంగళవారం పట్టణ మున్సిపల్ కమిషనర్‌కు బేడ బుడగ జంగం నేతలు వినతిపత్రం అందజేశారు. కమిషనర్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు, భూతం అంజి, తూర్పాటి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !