-సాయి కన్వెన్షన్లో పేకాట దందా11 మంది అరెస్ట్..
-రూ.18,750 నగదు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం..
హుజురాబాద్/ జూలై 09 (మా అక్షరం): పట్టణంలో మూడుముక్కల పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక సాయి కన్వెన్షన్ అండ్ లాడ్జ్లో పేకాట జరుగుతున్నట్టు గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన సమాచారం మేరకు పోలీసులు హఠాత్తుగా దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న హుజురాబాద్ చెందిన తిప్పబత్తిని చంద్రయ్య, మంద కుమారస్వామి కందుగుల, జంగ సంపత్ మల్లారెడ్డిపల్లి, తాటికంటి తిరుపతి నర్సింగాపూర్,
మంద సతీష్ కందుగుల,
ముషం తిరుపతి రంగాపూర్,
పోలంపల్లి శ్రీరామరెడ్డి శాలపల్లి,
కడుగురి సంపత్ హుజురాబాద్,
మహమ్మద్ ఇషాక్ హుజురాబాద్,
ఎడ్డబోయిన చంద్రయ్య రంగాపూర్,
మాదిరెడ్డి చంద్రారెడ్డి జమ్మికుంట వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.18,750 నగదు, 11 మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు.పేకాట నిర్వహణకు ప్రదేశాన్ని అందించడంపై లాడ్జ్ యజమానిపై కూడా కేసు నమోదు చేసినట్టు హుజురాబాద్ పోలీసులు తెలిపారు.











