ఎల్కతుర్తి/జూలై 18 (మా అక్షరం):
మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో బాగంగా వల్బపూర్ గ్రామంలో శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ విచ్చేసి నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన పూజ కార్యక్రమం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అర్హులైన వారికందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post Views: 60











