హుజురాబాద్/ఆగస్టు 07( మా అక్షరం):వికలాంగుల పెన్షన్ల పెంపు కోసం ఈ నెల 13న హైదరాబాద్లో జరగనున్న మహా గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గురువారం పట్టణం లోని సాయిరూప్ గార్డెన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో హుజురాబాద్, మానకొండూర్ నియోజకవర్గాలకు చెందిన దివ్యాంగులు, చేయూత పెన్షన్ దారులు పాల్గొన్నారు.సమావేశానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ హాజరై మాట్లాడారు.పెన్షన్ పెంపు కోసం విస్తృతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని, అన్ని జిల్లాల వికలాంగుల సంఘాలు ఐక్యతతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు
Post Views: 104











