ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ గడ్డం రాజిరెడ్డి జన్మదిన వేడుకలు…
హన్మకొండ/ ఆగస్ట్ 08 (మా అక్షరం): టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) హన్మకొండ జిల్లా అధ్యక్షుడు, సాక్షి దినపత్రిక ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో చీఫ్, సీనియర్ పాత్రికేయుడు గడ్డం రాజిరెడ్డి జన్మదిన వేడుకలు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగాయి. రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఆయనను శాలువాతో సత్కరించి శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించారు. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్, సాక్షి ఎడిషన్ ఇంచార్జ్ వర్థెల్లి లింగయ్య, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, జర్నలిస్టులు తోట సుధాకర్, సాయిరాం, బొడిగె శ్రీను, నరేష్, పొడిచెట్టి విష్ణువర్ధన్, రవీందర్, రాజ్ కుమార్, పొగాకుల అశోక్, ప్రశాంత్, నాగరాజు, ప్రశాంత్, సోమనర్సయ్య, భరత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.











