+91 99635 77856

104 ఉద్యోగులకు కంటిన్యూయేషన్ ఆర్డర్లు ఇవ్వాలని వినతి

-104 ఉద్యోగులకు కంటిన్యూయేషన్ ఆర్డర్లు ఇవ్వాలని వినతి…
హుజురాబాద్ /ఆగస్టు 08 (మా అక్షరం): తెలంగాణ 104 కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు104 ఉద్యోగులకు కంటిన్యూయేషన్ ఆర్డర్లు ఇవ్వాలని కోరుతూ హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు కు 104 ఉద్యోగులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏప్రిల్ 2025 నుండి ఎలాంటి కంటిన్యూషన్ ఆర్డర్లు ఇవ్వడం లేదని, అప్పటి నుంచి జీతాలు అందడం లేదని అన్నారు. జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. కొందరికి మాత్రమే కొనసాగింపు ఉత్తర్వులు వచ్చాయని అన్నారు. మిగిలిన వారందరికీ వెంటనే కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజీరు, చంద్రశేఖర్, రమేష్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !