-రాష్ట్ర స్పోర్ట్స్ స్కూలుకు ఎంపికైన దివ్యాంజలి…
హుజురాబాద్/ ఆగస్టు 20(మా అక్షరం): పట్టణానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు చింతల సతీష్ వర్మ కుమార్తె దివ్యాంజలి రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్లో చోటుదక్కించుకుంది.జూలై 5న హకింపేట్లో జరిగిన రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఆమె, రాష్ట్రస్థాయిలో 35వ ర్యాంక్ సాధించి ఎంపికైనట్లు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సిహెచ్. సంపత్రావు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ క్రీడాకారులు గండ్ర సమ్మిరెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్,మోటం రవీందర్,దామోదర్, సారయ్య, మహేష్, బాలకృష్ణ దివ్యాంజలికి అభినందనలు తెలిపారు.
Post Views: 182











