హుజురాబాద్/ఆగస్టు19(మా అక్షరం): పట్టణంలోని పలు ప్రాంతాలలో డివిజనల్ ఇంజనీర్ సండి లక్ష్మారెడ్డి, సహాయ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్తో పాటు సంబంధిత అధికారులు విద్యుత్ స్తంభాలను మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ… కొన్ని ప్రాంతాలలో డిష్ కేబుల్ వైర్లు గుతులుగా, అడ్డదిడ్డంగా స్తంభాలకు కట్టివేయబడటం వలన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. కేబుల్ ఆపరేటర్లు వచ్చే రెండు మూడు రోజుల్లో కేబుళ్లను సక్రమంగా సర్దుబాటు చేయాలని ఆదేశించారు. అలాగే విద్యుత్ ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.అదేవిధంగా, వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలలో కూడా ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విగ్రహ తయారీదారులు, స్థానిక అధికారులకు డి.ఈ సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏ.డి.ఈలు, ఏ.ఈలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











