కమలాపూర్/ సెప్టెంబర్ 01(మా అక్షరం):మండలంలోని మర్రిపెల్లిగూడెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ సభ్యుడు జియఉద్దీన్ రెండు రోజుల క్రితం మృతి చెందగా, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ ఆర్కే సాగర్ సూచనల మేరకు ఆయన కుటుంబాన్ని జనసేన స్థానిక నాయకులు సోమవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్, సాగర్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. కుటుంబానికి జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, క్రియాశీలక సభ్యత్వం ద్వారా వర్తించే రూ.5 లక్షల ప్రమాద భీమా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు బైరగొని అరవింద్ గౌడ్, హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు తగరపు శ్రీనివాస్, కరీంనగర్ నియోజకవర్గ నాయకులు న్యాంతాబాద్ జనార్ధన్, కమలాపూర్ మండల నాయకులు జిల్లాల మహేష్, ఇంగే శ్రీనివాస్, కుసుంబ సాంబశివరాం, పోరండ్ల రాము తదితరులు పాల్గొన్నారు.











