భక్తిశ్రద్ధలతో మహాత్మ యూత్ నిత్య అన్న ప్రసాదం…
హుజురాబాద్/ సెప్టెంబర్ 01(మా అక్షరం):
పట్టణంలోని ప్రతాపవాడలో మహాత్మ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిత్య అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ సీఐ టి.కరుణాకర్ హాజరై, అన్నప్రసాదాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. వినాయక నవరాత్రి ఉత్సవాలను గత ఐదేళ్లుగా భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్న మహాత్మ యూత్ సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎస్సై ఎం.డి. యూనస్ కూడా కార్యక్రమంలో పాల్గొని, యూత్ సభ్యుల కృషిని ప్రశంసించారు.కార్యక్రమంలో మహాత్మ యూత్ కార్యకర్తలు విడపు అనురాగ్, శివసాయి, అనుదీప్, రవిచంద్ర, ప్రీతం, సాయికృష్ణ, హర్షవర్ధన్, సాయి తేజ, పవన్, నిషిత్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 205











