ఎల్కతుర్తి/ సెప్టెంబర్ 3 (మా అక్షరం)
మండలంలోని బుధవారం రోజున నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, చింతలపల్లి మాజీ ఎంపీటీసీ సుకినే సంతాజి ని ఘనంగా సన్మానించిన మండల సూరారం గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్ చల్లూరి వేణు ఆధ్వర్యంలో సుకినే సంతాజి వారి నివాసంలో పూల బొకే అందజేసి శాలువతో సన్మానించడం జరిగింది. ఆయన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు చేపట్టాలని ఆయన కష్టానికి తగిన గుర్తింపు ఇచ్చిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ మెంబర్ చల్లూరి వేణు టి ఆర్ ఆర్ ఎస్ అధ్యక్షులు హింగే భాస్కర్, రిపోర్టర్ శ్రీ రామోజు సతీష్ చారి, రిపోర్టర్ కందుకూరి రాజన్న, స్వతంత్ర టీవీ రిపోర్టర్ వెంకటేష్, రిపోర్టర్ నల్లా రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.











