హుజురాబాద్/ సెప్టెంబర్ 04 (మా అక్షరం): పట్టణంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నిమజ్జన ప్రదేశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్ జి , హుజురాబాద్ టౌన్ సీఐ కరుణాకర్, హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్, జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ, జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ కేంసారపు. సమ్మయ్య, విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ జరీనా, ఇరిగేషన్ శాఖ ఏఈ కీర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.
Post Views: 126











