+91 99635 77856

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం

హుజురాబాద్/సెప్టెంబర్ 04 (మా అక్షరం): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ వి.ఆంజనేయరావు ఆధ్వర్యంలో, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుగుణ సమర్పణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులకు శాలువాలు కప్పి, పూలగుచ్ఛాలు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… దేశ రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టిన రోజును 1962 నుండి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఉపాధ్యాయుల సేవలు సమాజానికి వెలకట్టలేనివిఅని తెలిపారు.ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ సుగుణ మాట్లాడుతూ…ప్రతి ఒక్కరి ఎదుగుదలకు ఉపాధ్యాయులే కారణం. వారు సమాజానికి మంచి పౌరులను తీర్చిదిద్దుతున్నారు అని అభినందించారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు ప్రసాద్, తులసీదాసు, వాసుదేవారావు, రాజశేఖర్, విజయేందర్‌రెడ్డి తదితరులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !